ప్రేమ వివాహాలు ఈ కాలం లో ఎంతో సేపు నిలబడ్డం లేదు అనేది చూస్తూనే ఉన్నాం. సంవత్సరాల కాలం లో విడిపోయే వారు నెలలు , రోజులు కి దిగిపోయిన పరిస్థితి లో ఈ గంట ఏకంగా గంటల వ్యవహది లోనే విడిపోయి సంచలనం సృష్టించింది. మదనపల్లె కి చెందిన యువకుడు బెంగళూర్ లో ఒక ప్రైవేటు కంపెనీ లో పని చేస్తున్నాడు. అతను తిరపతి కి చెందిన ఒక అమ్మాయి ని దాదాపు రెండు ఏళ్ళు గా ప్రమిస్తూ ఉన్నాడు. ఆమె మొదట ఒప్పుకోక పోయినా అతనిలోని సిన్సియర్ ప్రేమికుడిని చూసి ప్రేమించి , మనసు ఇచ్చింది. ఇంట్లో వారి ప్రేమ గురించి తెలియగానే ఇద్దరికీ ఒప్పుకోరు అనే విషయం అర్ధం అయిపోయి నెమ్మదిగా ఇంట్లోంచి జారుకున్నారు.

 

మొన్న ఆదివారం ములకల చెరువు అనే ప్రాంతం లో ఒక గుడి లో పంతులుగారు సహకారం తో పెళ్లి చేసుకున్నారు వారిద్దరూ. ఎన్నో సంవత్సరాల వారిద్దరి ప్రేమ కీ పెళ్లి అనే కొత్త తెర లేవడం తో వారి సంతోషానికి అవధులు లేవు అనే చెప్పాలి. మొత్తం మీద కొత్త వధూ వరులు ఇద్దరూ సంతోషంగా పెళ్లి ముగించుకుని మదనపల్లె బస్టాండ్ కి వచ్చి తిరుపతి బస్సు ఎక్కుతూ ఉండగా పెళ్లి కూతురు అక్కలు ఇద్దరు వారిద్దరికీ అడ్డం పడ్డారు. ఆమె ఇన్నాళ్ళూ ప్రేమించిన కుర్రాడు వేరే కులం వాడు అనీ, అలా వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం తమ ఇంటా వంటా లేదు అనీ, అసలు వేరే కులపోడిని చేసుకోవడం వలన వచ్చే నష్టాలు ఏంటి అనేది వారు కనీసం అరగంటకి పైగా ఆ పెళ్లి కూతురు కి కౌన్సిలింగ్ తీసుకున్నారు.

 

 

 దీంతో ఆ వధువు మనసు మార్చుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తి అని తనకు ఏనాడూ చెప్పలేదంటూ అతనిపై మండిపడి, ఈ పెళ్లి ఇష్టం లేదని వెంటనే తాళి తీసేసింది. కానీ యువకుడు మాత్రం తాను వేరే కులం వాడిని అని ఎప్పుడో చెప్పాను అంటూ అక్కడ గట్టిగట్టిగా అరుస్తూ గొడవ చేసాడు. స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వగా మొత్తం అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి వ్యవహారం తిరుపతి వరకూ వెళ్ళింది.


మరింత సమాచారం తెలుసుకోండి: