ఈ మద్య మహిళలపై దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలతో మహిళకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుందని ప్రతిరోజూ ఎక్కడో అక్కడ దారుణమైన సంఘటనలు జరిగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో మరో దారుణం జరిగింది. రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ సాప్ట్వేర్ ఉద్యోగిని పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ ఆగంతకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. హతురాలు చూలైమేడు ప్రాంతానికి చెందిన స్వాతి(25)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూలైమేడు ప్రాంతానికి చెందిన స్వాతి అనే యువతి ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ చేస్తుంది. స్వాతి సూలైమేడు ప్రాంతంలోని దక్షిణ గంగై వీధిలో నివసించేది.
ప్రతిరోజూ లాగే స్వాతి తండ్రి ఆమెను నుంగంబాకమ్ స్టేషన్ వద్ద దించి వెళ్లాడు. దీంతో ఆఫీసుకు వెళ్లేందుకు నుంగంబాకమ్ రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తోంది. కానీ అంతలోనే ఓ మృత్యువు ఆమెను తరుముతుందనుకోలేదు. నల్లపాయింటు, గ్రీన్ షర్ట్ వేసుకున్న ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి ఓ కత్తితో అతి దారుణంగా పొడిచి పొడిచి చంపి పరారయ్యాడు. స్వాతి ముఖం మీద, మెడ మీద తీవ్ర గాయాలయ్యాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: