దేశంలోనే అత్యంత విలాసవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఓవైపు కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చేశామని చెబుతూనే...మరోవైపు చంద్రబాబు విలాలసవంతమైన జీవినం కొనసాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం అంబటి రాంబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విదేశాల్లో బిచ్చగాడిలో అడుక్కుంటే పెట్టుబడులు రావని, రాష్ట్రంలో సదుపాయాలు బాటుంటేనే పెట్టుబడులు వస్తాయని అంబటి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఉంటే పెట్టుబడులు అవే వస్తాయన్నారు. విదేశీ వ్యామోహంతో అమరావతిని చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 



మౌలిక సదుపాయాలు కల్పించి మంచి పరిపాలనను అందిస్తే ఏపీకి పెట్టుబడులు వస్తాయి తప్ప విదేశాలకు వెళ్లి బిచ్చమెత్తితే రావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సీఎం ఐదు రోజుల చైనా పర్యటనకు వెళ్లడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో  విలేకరులతో  మాట్లాడారు.గతంలో జపాన్ పర్యటనలో కొన్ని కంపెనీలతో చేసుకున్న ఎంఓయూలు ఏమయ్యాయని, అక్కడి నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.



పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలంటూ ఎంత కాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.  ఈ రెండేళ్ల కాలంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఒక్క కంపెనీ ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రత్యేక విమానాల్లో తరలుతున్న సూట్కేసుల్లో ఏమున్నాయో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ఏపీలో దోచుకున్న సొమ్ము విదేశాల్లో దాచుకోవడానికి వెళుతున్నా అని అడిగారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపై కేంద్రం దృష్టి సారించాలని ఆయన సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: