భారత దేశంలో మహిళ రోజు రోజుకి మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు భారత దేశంలో మహిళలను దేవతల్లా చూసేవారని వారిని పూజించే వారని అందుకే భారతీయ సంస్కృతిపట్ల ముఖ్యంగా ఇక్కడ మహిళల కట్టుబాట్లు సాంప్రాయాలంటే విదేశీయులు కూడా ఎంతో గౌరవించే వారిని చూసి నేర్చకునే వారని చెబుతారు. కానీ ఇప్పుడు అంతా తారు మారైంది..దేశంలో ప్రతి రోజూ మహిళల పట్ల కొంతమంది కామాంధుల అరాచకాలు..కట్నం కోసం కొంత మంది చేసే దర్మార్గాలు చూస్తుంటే ఎంతో దారుణం అనిపిస్తుంది. తాజాగా రాజస్థాన్ లో ఓ దారుణం జరిగింది.

ఇస్తామన్న కట్నం ఇవ్వనందుకు ఓ యువతిని అది దారుణంగా అవమానించడమే కాకుండా కన్నకూతురు లా చూడాల్సిన మామ, సొంత తమ్ముడిలా ఉండాల్సిన మరిది ఆమెపై అత్యాచారం చేశారు. అంతే కాదు తాను ఇవ్వాల్సిన 51 వేల కట్నం ఇవ్వలేదని  తన భర్త, అత్త మామలు, బావ మరది తనకునరకం చూపించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ కోడలికీ ఇవ్వడని శిక్ష తనకు వేశారని ‘నీ తండ్రి దొంగ’ అని టాటూను తన నుదుటిమీద తన భర్త రాయించాడని, పైగా తన అత్త మామలు ఒళ్లంతా వాతలు పెట్టారని, మామ, బావ మరది తనపై అత్యాచారం చేశారని ఆ బాధితురాలు పేర్కొంది.

గత జనవరిలో పెళ్ళయిన ఆరు నెలలనుంచి నన్ను చిత్రహింసలు పెట్టారు అని జైపూర్ లోని అమేర్ లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ప్రస్తుతం బాధితురాలి భర్త, అతని తలిదండ్రులు పరారీలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: