ఉత్తరప్రదేశ్ లోని భదోహిలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు ప్రయాణిస్తున్న వ్యాన్ ను రైలు ఢీకొననడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాపలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వ్యాన్ లో 19 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. చక్కగా తయారై స్కూలుకెళ్లేందుకు చిన్నారులు ఎక్కిన ఓ స్కూల్ బస్సును వేగంగా దూసుకువచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. 



ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాపలా లేని రైల్వే గేటు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. వేగంగా దూసుకువస్తున్న రైలును అంతగా గుర్తించని స్కూల్ బస్సు డ్రైవర్ రైల్వే పట్టాలను దాటేందుకు యత్నించాడు. అయితే పట్టాలు దాటేలోగానే వేగంగా దూసుకువచ్చిన రైలు స్కూల్ బస్సును ఢీకొట్టేసింది. 



ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. పలువురు చిన్నారులు కూడా గాయపడినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: