మన దేశ, రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఎన్నికల సమయంలో ప్రజలంతా ఏదైనా ఒక పార్టీకి ఓట్లు వేయాలంటే ప్రధానంగా గమనించేవి వారి హామీల మానిఫెస్టో నే. వారి ఆశయాలకు అనుగుణంగా ఆ చిట్టా ఉంటే వారి వల్ల అంతో కొంతో అభివృద్ధి జరగకపోదా అని ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించుకుంటారు ప్రజలు. ప్రజల మన్ననలను పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత విలాసాలతో తూలుతున్న నేతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే తీరిక లేక ప్రజలచే తీవ్రంగా విమర్శింపబడతారు. ఇలాంటి రాజకీయాలు నేటి సమాజంలో సహజం, సర్వసాధారణం.