కబడ్డీ ప్రపంచకప్-2016ను భారత్ కైవసం చేసుకుంది. మొదటి అర్ధభాగం నుంచి దూకుడైన ఆటతీరుతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగంలో ఆచితూచి ఆడిన ఇరు జట్లు అనవసర తప్పిదాలకు పోకుండా నువ్వానేనా అన్నరీతిలో పోరాడాయి. వరుసగా మూడు సార్లు కబడ్డీ ప్రపంచకప్ గెలుచుకుని భారత్ రికార్డు నెలకొల్పింది. లీగ్ ప్రారంభ దశలో భారత్, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా చేతిలో ఓటమి పాలై టోర్నీలో ఆసక్తి రేపింది. అనంతరం వరుస విజయాలు నమోదు చేసిన భారత కబడ్డీ జట్టు నిన్న జరిగిన సెమీఫైనల్ లో థాయ్ లాండ్ జట్టును ఓడించి ఫైనల్