తెలంగాణలో ఎన్నికలు పెడితే మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితే తిరుగులేని విజయం సాధిస్తుందంటూ ఓ సర్వే వెల్లడించిన అంశాలపై ప్రతిపక్ష పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. ఈ రోజు ఈ అంశంపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆ సర్వే అంతా బోగస్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీపీ నేత రేవంత్రెడ్డి ఈ అంశంపై స్పందించారు. శనివారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ, జనరంజక పాలన అని, సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొన్ని జేబు సంస్థల ద్వారా చేయించుకున్న సర్వే