తెలంగాణ ఉద్యమం సమయంలో వారంతా ఒకరికి ఒకరు అన్నట్లుగా చెట్టాపట్టాలేసుకు తిరిగారు. తీరా స్వరాష్ట్రం సిద్ధించాక ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారారు. తెలంగాణ నవ నిర్మాణంలో వారంతా కలసి నడుస్తారని.. నవ తెలంగాణను ఆవిష్కరిస్తారని అనుకున్నా.. ఇప్పుడు పరస్పర విమర్శలతో జనాలను నివ్వెర పరుస్తున్నారు.