జమ్ము కాశ్మీర్ లోని ఉరీ సైనిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులు 20 మంది జవాన్ల ప్రాణాలు తీశారు. దీని వెనుక పాకిస్తాన్ హస్తముందని, ఆ గడ్డపై నుంచి ఈ దాడికి రూపకల్పన జరిగిందని భారత్ మొదటి నుంచి వాదిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం అవన్నీ ఆరోపణలేనని తోసిపుచ్చుతూ వస్తోంది. కానీ ఈ దాడికి సూత్రధారులెవరు, వారి వెనుక ఎవరున్నారో.. ఇప్పుడు మొత్తం బయటికొచ్చేసింది.