హైదరాబాద్ లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. బేగం బజార్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న బాణాసంచాను వాహనంలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు వాటికి నిప్పంటుకుని పేలిపోయాయి. దీంతో రోడ్డుపైనే వాహనాన్ని నిలిపేసి డ్రైవర్ పరారయ్యాడు. దీంతో చుట్టు పక్కల స్థానికులు పరుగులంగించుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో వాహనం పూర్తిగా తగలబడిపోయింది.