ఏవోబీ ఎన్కౌంటర్పై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. లోకేష్, చంద్రబాబు తమ నుంచి తప్పించుకోలేరని, అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తామనమని, ఎల్లకాలం పోలీసులు. మిలట్రీ కాపాడలేరని మావోయిస్టులు పేర్కొన్నారు. మోదీ, చంద్రబాబు కుట్ర ఫలితమే హత్యాకాండ అని, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తామని వారు చెప్పారు. చంద్రబాబు తేనె పూసిన కత్తి అని, విశాఖ మారణకాండ ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తాడని మావోయిస్టు పార్టీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్ అన్నారు.