తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ వాస్తు పేరిట కొన్ని భవనాలను కూల్చి అదే ప్రదేశంలో కొత్త భవనాలను కట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ప్రస్తుతం ఖైరతాబాద్ పరిధిలోని అసెంబ్లీ, సచివాలయ భవానాలని కూల్చి వాటి ప్రదేశంలో కొత్త భవనాలను నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కేసీఆర్ పై మండిపడ్డారు.