దేశ అభివృద్ధికి అడ్డుపడుతున్న అవినీతిని అంతమొందించాలని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాలోచనలు చేస్తున్న మోడీ అందుకు సరైన సమయం కోసం వేచిచూడడం జరిగింది. అయితే ఇంతటి పెద్ద కార్యం అనేది హుటాహుటిన జరిగే పని కాదు. ఈ ఆలోచన వచ్చిన వెంబడే మోడీ ఆర్బీఐ గవర్నర్ తో దాదాపుగా ఆరునెలలు చర్చించి కొత్త నోట్లను ముందుగానే ముద్రించి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత నగదు రహిత సమాజాన్ని స్థాపించడమే మోడీ ప్రధాన లక్ష్యమని ప్రకటించడం జరిగింది.