కరెన్సీ విషయంలో భారతదేశం కొత్త దారులు వెతుకుతోంది. మొన్నటికి మొన్న 500, 1000 నోట్లు రద్దు చేసిన ప్రధాని మోడీ.. అందరూ నగదు రహిత చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచించారు. బ్లాక్ మనీని అరికట్టేందుకు అన్ని లావాదేవీలు కార్డుల ద్వారా జరపడమే మంచిదని సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ మాటేమో కానీ.. సామాన్యులు మాత్రం నానా కష్టాలు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలో గంటల గంటలు నిలబడి వెయ్యి, రెండు వేలతో బయటికొస్తున్నారు. ఆ కష్టాలు తీర్చడంతో పాటు చిల్లర కష్టాలు కూడా తీర్చేందుకు ఆర్బీఐ నడుం బిగ