నవంబర్ 8... రాత్రి 8 గంటల సమయంలో అనూహ్యంగా ప్రధాని మోదీ టీవీ సెట్లలో ప్రత్యక్షమయ్యారు. నల్లధనంపై పోరాటం కోసం పెద్ద నోట్లు రద్దు చేస్తున్నానని ప్రకటించారు. రేపటి నుంచి 1000, 500 నోట్ల చెల్లవంటూ దేశ జనం గుండెల్లో బాంబు పేల్చారు. వాటిని మార్చుకునేందుకు డిసెంబర్ 30 వరకూ గడువు ఉంటుందని తెలిపారు.