ఉప ఎన్నికల అనంతరం పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు పీసీసీ ఏర్పాటు చేసిన మంత్రుల విశ్లేషణ కమిటీ తన మధ్యంతర మొదటి నివేదిక సమర్పణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. \నివేదికను పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి యన్.కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించాలని మంత్రి ధర్మన ప్రసాదరావు నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడం, బొత్స సత్యనారాయణ సొంత పనులపై ఢిల్లీ వెళ్లడం వల్ల ని వేదిక సమర్పణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు పీసీసీ నాయకులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: