రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలనీ, సంవిధానం అన్నిటి కంటే ఉన్నత మైనదనీ, చట్టం ఎదుట అందరూ సమానమేననే అభిప్రాయంతో ప్రజలు న్యాయస్థానాలను విశ్వసిస్తారు. తాము కళ్ళతో చూసిన విషయం, చెవులతో విన్న అంశం కోర్టులలో నిగ్గుతేలకుండా తేలిపోతుంటే పౌరులు గందరగోళంలో పడతారు. ఇటువంటి అనుభవం తరచుగా ఎదురైతే న్యాయవ్యవస్థపైనే అవి శ్వాసం కలుగుతుంది. కేసు వాదించే న్యాయవాది లోపమో లేక చట్టాన్ని అన్వ యించడంలో న్యాయమూర్తి వైఫల్యమో తెలియదు.