ఇండియాలో పెద్ద నోట్లు రద్దై సోమవారానికి 34 రోజులు గడిచాయి. అయినా సామాన్యుల కరెన్సీ కష్టాలు తీరలేదు. పైగా రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. 50 రోజుల్లో నోట్ల కష్టాలు తీరక పోతే దానికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు ప్రధాని మోదీ. అయితే భారత్ నిర్ణయం పట్ల చాలా దేశాలు పెదవి విరిచాయి. ఇక రష్యా అయితే ఏకంగా భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. నోట్ల రద్దుతో ఢిల్లీలో తమ రాయభార కార్యాలయాన్ని నిర్వహించడం కష్టంగా మారిందని, దీనిపై వెంటనే పునరాలోచన చేయాలని కోరింది.