సంచలనం సృష్టించిన దిల్ సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో మూడున్నర యేళ్ల తర్వాత విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం తీర్పు ప్రకటించనుంది ఎన్.ఐ.ఏ.కోర్టు. ఈ కేసులో మొత్తం 157 మంది సాక్షులను విచారించింది కోర్టు. ప్రాసిక్యూషన్ ను బలహీన పర్చేందుకు నిందితులు ఎత్తులకు పై ఎత్తులు వేశారు. ఈ నేపథ్యంలో తీర్పు ఎలా రానుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.