విద్యార్థులను తెలంగాణ ఉద్యమాల వైపు నడిపించేందుకు విద్యార్థి జెఏసి సన్నద్దమవుతుంది. ఇందులో భాగంగానే భవిష్యత్తులో చేపట్టబోయేకార్యచరణను విద్యార్థి జెఏసి విడుదలచేసింది. ముందుగా విద్యార్తి జెఏసిని పటిష్టం చేయడం కోసం సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆగస్టు 1నుండి 8వరకు సభ్యత్వనమోదు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అదే విధంగా సెప్టెంబర్ 1నుండి 17వ తేదివరకు తెలంగాణలో పాదయాత్ర నిర్వహించాలని, అనంతరం సెప్టెంబర్ 27న బారీ సంఖ్యలో విద్యార్థులతో చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఓయూ జెఏసి కార్యచరణ ప్రకటించింది. అయితే ప్రకటించిన కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం విద్యార్థి జెఏసి దృష్టి సారించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: