తెలంగాణ ప్రాంతంలో నూతనంగా మరో విధ్యార్థీ సంఘం స్థాపించబడింది. తెలంగాణ విధ్యార్థీ పరిషత్ గా దీనికి నామకరణ చేశారు. విధ్యార్థుల సమస్యలతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకుగాను తెలంగాణ విధ్యార్థీపరిషత్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రసమితికి అనుబంధంగా తెలంగాణ విధ్యార్థీ పరిషత్ పనిచేయబోతున్నట్లు విధ్యార్థీ పరిషత్ ఆవిర్భావ సమావేశ పరిస్థితులను స్పష్టమవుతుంది. ఇప్పటికే టిఆర్ఎస్ కు అనుభంధంగా టిఆర్ఎస్ వి పనిచేస్తుండగా మరో విద్యార్థీ సంఘం స్థాపించబడింది. సోమవారం నాడు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు టిఆర్ఎస్ నాయకులు, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు గౌరిశంకర్ తదితరులు హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విద్యార్థీ పరిషత్ ఆవీర్భావ సదస్సులో పాల్గొని తెలంగాణ విద్యార్థీ పరిషత్ ఏ కార్యక్రమాలు చేపట్టాలో, భవిష్యత్తు ప్రణాళక ఎలా ఉండాలనే విషయాలపై సూచనలిచ్చారు. అనంతరం గన్ పార్క్ వద్దగల తెలంగాణ అమర వీరుల స్తూపానికి నివాళులు అర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: