రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పి.వి.సింధు ఇక డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలో కనిపిస్తారు. సింధుకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ, ఒలింపిక్ పతకం గెలిచిన తరువాత సింధు కోరుకుంటే ప్రభుత్వోద్యోగం ఇస్తామని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారని ఆమె గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ తరపున ఈ బాధ్యత తీసుకునేందుకు సింధు సమ్మతి తెలిపారు. 21 ఏళ్ల సింధు ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బిపిసిఎల్ హైదరాబాద్ కార్యాలయంలో 2013 నుంచీ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు.ఏపీ సీఎం చంద్రబాబు అప్పట్లో ఆమె ఒప్పుకుంటే గ్రూప్ వన్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగమిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సింధుకు ఏపీ ప్రభుత్వం సూచించిన ఆఫర్ కు అంగీకరించినట్టు ఆమె తెలిపారు.