రాక్షసత్వం, క్రౌర్యం, కక్ష, దురాశ, దోపిడీ, పగ, ప్రతీకారం అలోచనలతో కూడిన నాయకత్వం ఎక్కువ కాలం రాజ్యాంగ ప్రేరేపిత పాలనాధికారం లో ఎక్కువకాలం మన లేదు. నాయకులు ఎన్నికల్లో ఎన్నో వాగ్ధానాలు చేస్తారు. కాని వాటిలో సానుకూల అలోచనలు తో కూడిన వాగ్ధానాల అమలును మాత్రమే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా ఎన్నికల ప్రచారములో ప్రజలు ఉద్వేగం తో జై కొట్టారుగదా అని ప్రతికూల ఆలోచనలతో కూడిన వాగ్ధానాలను అమలుచేయటం ప్రారంభిస్తే అమెరికాలో డొనాల్ద్ ట్రంప్ లా దేశవ్యాప్త ప్రజా నిరసన, ప్రతిపక్ష, స్వంతపార్టీ పక్ష సభ్యులు అంతా ఒకటై నాయకత్వాన్ని వేటాడే పరిస్థితులు నెలకొంటాయి. అదే దుస్థితి నేడు తమిళనాడులో శశికళకు పట్టేలా ఉంది. దుర్మార్గపు పాలనను ఎవరూ అవుట్ అండ్ అవుట్ రేట్ గా అంగీకరించరు.
"గయ్యాళి పెళ్ళాన్ని వదిలించుకోవటం ఎలా?" అని ఆలోచించినట్లు అమెరికన్ ప్రజలు, “ తెంపరితనం ప్రదర్శించి అమెరికాకు ప్రపంచ వ్యాప్తంగా కీడు చేస్తున్న అధ్యక్షుడిని వదిలించుకోవడం ఎలా?” ఇప్పుడు అమెరికాలో అనే విషయం పై చర్చలు, పరిశోదనలు, విశ్లేషనలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు
అమెరికా లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా రాజకీయ నిపుణులు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నారు. ఎందు కంటే యు.ఎస్.ఏ అంటే నేడు ఒకే ఒక్క స్వతంత్ర ఆలోచనలు గల దేశంగాదు. ప్రపంచాన్ని "అనేక దేశ విదేశ బహుళ ప్రాయోజిత బాందవ్యాలతో సంబందాలతో ఏకం చేసి తన కనుసన్నల తో శాసిస్తున్న పెద్దన్న" ప్రతి బాందవ్యం వెనుక పరస్పర బహుళ అవసరాలు పెనవేసుకుని ఉన్నాయి. అవి మిత్రత్వమే కాదు శతృత్వ ప్రేపేపిత అంశాలు కూడా కావచ్చు.
వ్యాపారాల్లో ఎదిగిన డొనాల్డ్ ట్రంపు "లాభ నష్టాలు" లెక్కలు మాత్రమే తెలిసుండవచ్చు. దేశాలమధ్య అలా కాదు స్వల్ప, దీర్ఘ, సుధీర్ఘకాల ప్రయోజనాలతో సంభందాలు మిళితమై ఉంటాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగైదు వారాల పాలనతోనే, తన తెంపరి ఆలోచనలతో కూడిన విధానాల అమలు ద్వారా అమెరికానే కాదు ప్రపంచాన్నంతా హడలెత్తిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే డొనాల్డ్ ట్రంప్ ప్రజల్లో మెజారిటీ విశ్వాసం కోల్పోయారని, దేశంలో మూడోవంతు మందికన్నా ఎక్కువ మందే అధ్యక్షుడిని అభిశంసించాలని కోరుకుంటున్నారని తాజా సర్వే లో వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎంతో కాలం అధ్యక్షుడిగా కొనసాగబోరని, మధ్యలోనే సొంత రిపబ్లికన్ పార్టీయే ఆయనను బలవంతంగా అధికారం నుండి బయటకు పంపాలని వ్యూహలు రచిస్తోందని అంతర్గత విశ్లేషణ లు వినిపిస్తున్నాయి.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే అభిశంసనను ఎదుర్కొనే అవకాశాలు పెరిగిపోయాయి లేక పోతే రాజ్యాంగపరంగా చట్టపరంగా అధికంగా ఉన్నాయని,
చర్యలు తీసుకునే అవకాశాలను దేశ అంతర్గతంగా అటు స్వంతపార్టి,
ఇటు విపక్షం,
మరో దిశలో ప్రజలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు,
రాజ్యాంగవ్యవస్థలు దేశం వెలుపల నుండి తమతో ఉన్న బాందవ్యాలను ఒప్పందాలను,
ఆనవాయితీలను చూపుతూ విదేశా ల నుండి కూడా ఒత్తిడి పెరుగుతుంది. లేదంటే 25 వ రాజ్యాంగ సవరణను ప్రయోగించడం ద్వారా ట్రంప్ను పదవీచ్యుతుణ్ణి చేసి రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ చేయాలనె అలోచన సర్వత్రా పెరుగుతూ వస్తుంది. హాట్టాపిక్గా రిపబ్లికన్ పార్టి ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తా రని రాజకీయ నిపుణులు జోస్యం చెప్తున్నారు. అమెరికా అధ్యక్షడిగా అనూహ్యంగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ‘మా అధ్యక్షుడు కాదు’ అంటూ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయం లోనూ దేశ రాజధాని సహా అన్ని ప్రముఖ నగరాల్లోనూ భారీ నిరసన ప్రదర్శనలు, వ్యతిరేఖత వెల్లడయ్యాయి.
ఇప్పుడు ‘ట్రంప్ను అభిశంసించాలి’ అనే ఉద్యమం అమెరికాలో బలపడుతోంది. ఇప్పటికే పలు సంస్థలు ఇందుకోసం సంతకాలు, విరాళాల సేకరణ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ను అభిశంసించగల అంశాలేవి అన్నది ఆసక్తిగా మారింది.
“అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అభిశంసించదగ్గ అంశాలు ఇప్పటికే చాలాఉన్నాయి. కానీ, ఆయన తమకు భారమని రిపబ్లికన్లు ఎప్పుడు నిర్ణయించుకుంటారనేదే ప్రశ్న” అని పలువురు రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చిన రష్యాతో సంబంధాలు మొదలుకొని, అధ్యక్షుడిగా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లోని అంశాల వరకూ చాలా విషయా ల్లో ట్రంప్ను అభిశంసించదగ్గ కోణాలు ఉన్నాయని వారు చెప్తున్నారు.
-కోర్టులతో ట్రంప్ పోరాటం కూడా అభిశంసన దిశగా దారితీయవచ్చు. అమెరికాలోకి శరణార్థులు, ఏడు దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్ ఉత్తర్వును సమర్థిస్తూ 9 వ సర్క్యూట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వేగంగా సమీక్షించవచ్చు. ట్రంప్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టినట్లయితే, కోర్టును ధిక్కరించడానికి ఆయన ప్రయత్నిస్తారా? అలా చేయడం, అభిశంసించగల మొదటి తరగతి నేరమవుతుంది.
- ఇక రెండో రకం అభిసంసించగల నేరం, ట్రంప్ వ్యక్తిగత ప్రయోజనాలు, అధ్యక్షుడిగా అధికారిక విధులు రాజీపడటం. ట్రంప్కు రష్యాలో విస్తృత వాణిజ్య ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఆయన ‘సత్సంబంధాలు’ ఈ కోవలోకి రావచ్చు. అలాగే.. పలు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్న దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు కూడా ఇందులోకి వస్తాయి. ట్రంప్ తనకు వ్యాపార ప్రయోజనాలు ఉన్న ముస్లిం దేశాలను ఈ ఉత్వర్వు నుంచి మినహాయించారు. అయితే.. ఆ దేశాల నుంచే ఉగ్రవాదులు వస్తుండటం గమనార్హం. ట్రంప్ ఉత్తర్వులో నిషేధించిన దేశాల నుంచి ఉగ్రవాదులు ఎవరూ రాలేదు. ఆ దేశాల్లో ట్రంప్ పెట్టుబడులూ లేవు.
- మరోవైపు.. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ విచిత్ర సన్నిహిత సంబంధాలపై సీఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. పుతిన్ కి అనుకూలంగా ప్రవర్తించడాన్ని ట్రంప్ కొనసాగిస్తే అభిశంసన ఇంకా ముందుకు జరగొచ్చు. గత ఆదివారం డొనాల్డ్ ట్రంప్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, పుతిన్ మీద మాటపడకుండా సమర్థించుకొచ్చారు. ‘పుతిన్ ఒక హంతకుడు’ అని టీవీ వ్యాఖ్యాత అభివర్ణిస్తే, ‘మనకు చాలా మంది హంతకులు ఉన్నారు. మన దేశం చాలా అమాయకమైనదని మీరు అనుకుంటున్నారా?’ అని ట్రంప్ ఎదురు ప్రశ్నించారు. ఇలా దేశాధ్యక్షుడే తనదేశమైన అమెరికాను కించపరచడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ సంపాదకుడు బ్రెట్ స్టీఫెన్స్ వ్యాఖ్యానించారు. మరి కొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ట్రంప్ తీరును తప్పుబట్టారు.
ట్రంప్ను అభిశంసించడానికి ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూడా తన వ్యూహానికి పదును పెడుతోంది. అయితే, ప్రస్తుత కాంగ్రెస్లో బలాబలాలను బట్టి అధికార రిపబ్లికన్ పార్టీ సాయం లేకుండా ఇప్పట్లో ట్రంప్ అభిశంసన సాధ్యంకాదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్లో తమ బలం పెరిగితే ఆ పార్టీ స్వయంగా అభిశంసన చేపట్టవచ్చు. మరోవైపు రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్ మీద ప్రేమ లేదు. నిజానికి ఆ పార్టీ అధినాయకత్వం మొదటి నుంచీ ట్రంప్ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ స్వయంగా ట్రంప్ను సాగనంపాలని యోచిస్తున్నట్లు చెప్తున్నారు.
‘రిపబ్లికన్లు కొంత కాలం ట్రంప్ను సహిస్తారు. గ్యాస్, చమురు, వాల్ స్ట్రీట్లపై నియంత్రణల తొలగింపు, పన్నుల కోతలు, పాఠశాలల ప్రైవేటీకరణ, కార్మికరక్షణ కుదింపు, సుప్రీంకోర్టులో కనీసం ఒక మితవాద న్యాయమూర్తి నియామకం వంటి పనులను పూర్తిచేసే వరకూ ట్రంప్ను భరిస్తారు. కొంత కాలానికి ట్రంప్ ఒక వైపరీత్యమని, పార్టీకి ప్రమాదకరమని, 2018 ఎన్నికలకు నష్టదాయకుడని రిపబ్లికన్ పార్టీ నాయకత్వం నిర్ధారణకు వస్తుంది. దీంతో ఆయనను వదిలించుకుని, ఉపాధ్యక్షుడు పెన్స్ ను అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయిస్తారు. ఈ వ్యూహాన్ని రిపబ్లికన్ పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాలు ఇప్పటికే చర్చిస్తున్నారు. రిపబ్లికన్లు సుదీర్ఘ ప్రక్రియ అయిన అభిశంసన ద్వారా ఈ పని చేయవచ్చు. ఇలాంటి చర్యలతో దెబ్బతిన్న ట్రంప్ మరింత క్రోధంతో ఇంకా ప్రతీకార చర్యలు చేపట్టవచ్చు.
లేదంటే.. 25వ రాజ్యాంగ సవరణను అనుసరించి ట్రంప్ను అసమర్థుడిగా నిర్ధారించి మరింత వేగంగా తప్పించవచ్చు. తద్వారా ఒక అనిశ్చితుడైన, నిరంకుశుడు కాగల అధ్యక్షుడి నుంచి అమెరికాకు విముక్తి కలిగించిన ఖ్యాతి కూడా రిపబ్లికన్ పార్టీకి లభిస్తుందన్నది వారి ఆలోచన. 2018 ఎన్నికల నాటికి పెన్స్ నేతృత్వంలో వీరంతా మళ్లీ ఏకం కావచ్చు’’ అని బ్రాండీస్ యూనివర్సిటీలోని హెల్లెర్ స్కూల్ ప్రొఫెసర్, అమెరికన్ ప్రాస్పెక్ట్ పత్రిక సహ సంపాదకులు రాబర్ట్ కట్నర్ తాజాగా రాసిన ఒక వ్యాసంలో విశ్లేషించారు.
అమెరికా రాజ్యాంగంలో రెండో అధికరణలోని సెక్షన్ 4లో అధ్యక్షుడి అభిశంసన గురించి చెప్తుంది. దేశద్రోహం, లంచం తీసుకోవడం, అధికార దుర్వినియోగం, బెదిరింపు లు, నిధుల దుర్వినియోగం, పర్యవేక్షణలో వైఫల్యం, విధులు నిర్వర్తించక పోవడం, తప్పుడు నడవడిక తదితర నేరాలకు పాల్పడినపుడు అభిశంసన ద్వారా అధ్యక్షుడి ని పదవీచ్యుతిడిని చేయ వచ్చు. కాంగ్రెస్లో ప్రతినిధుల సభ సాధారణ మెజారిటీతో అధ్యక్షుడిపై నేరాభియోగం మోపి అభిశంసించడానికి ఓటు వేయాలి. ఆ తర్వాత సెనేట్ విచారణ చేపట్టి అధ్యక్షుడి మూడింట రెండు వంతుల మెజారిటీతో అభిశంసనను ధృవీ కరించాలి. నిజానికి కాంగ్రెస్లో అభిశంసన ప్రక్రియను ప్రారంభించడా నికి దేశద్రోహం,
హత్య వంటి నేరాలకు ఆధారాలు అవసరం లేదు. ఆచరణలో ఏ అంశాన్నైనా ఇతర నేరాలుగా పరిగణించవచ్చు. ఇంతకుముందు మోనికా లూయిన్స్కీ కేసులో బిల్ క్లింటన్ను,
గతంలో వాటర్గేట్ కుంభకోణంలో రిచర్డ్ నిక్సన్పైన అభిశంసన చేపట్టారు.
అధ్యక్షుడు మరణించినపుడు, లేదా ఇతరత్రా కారణాల వల్ల అధికారాలు,
విధులు నిర్వర్తించలేనపుడు ఉపా ధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారని వివరించే నిబంధనను, అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ వివరిస్తుంది. ఇందులోని నాలుగో సెక్షన్ ప్రకారం, ‘అధ్యక్షుడు తన అధికారాలు, విధులు నిర్వర్తించ
లేకపో తున్నారు’ అని ఉపాధ్యక్షుడు, మెజారిటీ మంత్రు లు రాతపూర్వకంగా కాంగ్రెస్ ఉభయసభల సభాపతులకు తెలియజేయాలి. అలా జరిగినపుడు ఉపాధ్యక్షుడు తక్షణం క్రియా శీల అధ్యక్షుడిగా అధికారాలు,
బాధ్యతలు చేపడతారు. ఈ 25వ రాజ్యాంగ సవరణను కొద్ది మార్లే వినియోగించారు. జాన్ ఎఫ్. కెన్నడీ హత్యానంతరం ఒకసారి, రొనాల్డ్ రీగన్
కు క్యాన్సర్ సర్జరీ చేసినపుడు మరోసారి, జార్జ్ డబ్ల్యు. బుష్ కొలనోస్కోపీలు చేయించుకున్నపుడు ఇంకోసారి ఉపాధ్యక్షుడు క్రియాశీల అధ్యక్షుడిగా బాధ్యత లు నిర్వహించేలా ఈ అధికరణను అమలు చేశారు.