ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రోజు రోజుకీ రౌడీయిజం పెరిగిపోతందని ఇక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా నీరుగారిపోతుందని సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అసెంబ్లి ప్రాంగణంలో రోజా మీడియాతో మాట్లాడుతూ.. 'లా అండ్ ఆర్డర్ను తనలా ఎవరూ కంట్రోల్ చేయలేరని అసెంబ్లీలో చెప్పే చంద్రబాబు.. ఇప్పుడు రౌడీయిజానికి అండగా నిలుస్తున్నారు' అని మండిపడ్డారు.
ఈ మద్య బాబు ప్రత్యక్షంగా సెటిల్ మెంట్ల వ్యవహారంలో తలదూరుస్తున్నారని.. గతంలో వనజాక్షి, జానిమూన్ విషయంలోనూ సీఎం ఇదే విధంగా సెటిల్మెంట్ చేశారని ఆమె గుర్తు చేశారు. జగన్ తప్పు చేయలేదు కాబట్టి అప్పుడు క్షమాపణ చేప్పలేదన్నారు. ఇప్పుడు తప్పు చేసి కూడా 'మేం సారీ చెప్పం' అని బోండా ఉమ నిస్సిగ్గుగా చెబుతున్నారని రోజా అన్నారు.
ఇక ఏపిలో ప్రతిపక్ష హోదాలో ఉన్నవారిని పనిగట్టుకొని మరీ టెంపరరీ డీజీపీ కేసులు పెట్టడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో నారావారి నరకపాలన కొనసాగుతుందని, రౌడీయిజాన్ని అరికట్టడానికి చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.