ఆ 'ఐపీఎస్' నోరు విప్పితే నిజాలు చెప్పాలన్న జగన్...


తాను నోరు విప్పితే ఎన్నో నిజాలు బయటకు వస్తాయని ఓక సీనియర్ ఐపీఎస్ అధికారి చెప్పారని, ఆ నిజాలు ఏమిటో బయటకు రావాలని, ప్రజలు వాటిని తెలుసుకోవాల్సి ఉందని వైసిపి అధినేత జగన్ అన్నారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వాళ్ల మనుషులు తప్పు చేస్తే సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.

నిరూపించకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా?..

రెంజ్ ట్రావెల్స్‌తో తనకు సంబంధం ఉందని నిరూపించకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కడ ఏం జరిగినా తనకు ముడిపెడితారా? ఇంత దారుణంగా అబద్ధాలు చెబుతారా అని నిలదీశారు. సభ జరుగుతుండగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను అరెస్ట్ చేసి ఇంకా విడుదల చేయలేదని చెప్పారు.

నాని, ఉమలపై ఎందుకిలా?: బాబును ఏకేసిన చెవిరెడ్డి

రవాణా శాఖ అధికారిపై దాడికి పాల్పడిని టీడీపీ పార్లమెంటుసభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై కేసులు నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం నల్లరంగు దుస్తులు ధరించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో దీక్ష చేపట్టారు.

అప్పుల తెలంగాణ చేశారు...


తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీని తలపిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

స్నాక్స్ ఆశచూపి ఏడేళ్ళ బాలికపై అత్యాచారం..

వికారాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకొంది. స్నాక్స్ ఇప్పిస్తానని చెప్పి ఏడేళ్ళ బాలికపై ఓ గుర్తు తెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక తాండూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. వికారాబాద్ జిల్లా వెల్మకన్నె గ్రామానికి చెందిన ఏడేళ్ళ మైనర్ బాలిక 60 ఏళ్ళనానమ్మ వద్దే ఉంటోంది.అయితే ఐదేళ్ళ క్రితం తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె నానమ్మ వద్దే ఉంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: