ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో అధికార గులాబీ పార్టీ పై ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతలు అసెంబ్లీ సజావుగా జరగకుండా అడ్డు పడడంతో టీడీపీ ఎమ్మెల్యే లు రేవంత్ రెడ్డి, సండ్రలను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెండ్ అయిన వారికి అసెంబ్లీ లాబీల్లోకి రావడానికి అనుమతి పోలీసులు కల్పించారు. అయినా టీడీపీ ఎమ్మెల్యే రేవత్ రెడ్డి అసెంబ్లీకి రావడం తోనే అక్కడ ఎదురుంగా పెద్దపల్లి ఎంపీ బల్క సుమన్


Image result for himansh kcr

ఎదురుపడడంతో మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారని ప్రశ్నించగా కేసీఆర్ మనవడు హిమాన్ష్ రానిచ్చాడని చెప్పడంతి సుమన్ ఒక్క సారిగా అవాక్కయ్యారు. హిమాన్ష్ చెప్పడం వల్ల తనను రానిచ్చారని రేవంత్ సరదా వ్యాఖ్యలు చేశారు."నన్ను రానివ్వాలని హిమాన్ష్ వాళ్ల తాతకు చెప్పాడు కాబట్టే ఇక్కడి దాకా అనుమతించారు. మీలాంటి స్నేహితులకన్నా హిమాన్ష్ బెటర్" అని అన్నారు. "అలాగా... మీకు హిమాన్ష్ ఉంటే, 


Image result for himansh kcr

మాకు దేవాన్ష్ ఉన్నాడు" అని బాల్క సుమన్ చెప్పడంతో అక్కడున్న వారిలో నవ్వాగలేదు. ఆపై పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఎందుకు వెళ్లలేదని బాల్క సుమన్ ను ప్రశ్నించారు. పార్టీ పనుల్లో బిజీగా ఉండటంతోనే తాను వెళ్లలేదని చెప్పిన సుమన్, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: