స్నాప్ చాట్ సీయీవో అహంకారం తో చేసిన వ్యాఖ్యలు భారత దేశం లో పెను దుమారం రేపాయి. భారత దేశం పేద దేశం అంటూ మనలాంటి పేదవాళ్ళకి స్నాప్ చాట్ అక్కరలేదు అంటూ అతను చేసిన వ్యాఖ్యలు సంచలనాలుగా మారి ఆ సంస్థ కొంప ముంచాయి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ,


స్నాప్ చాట్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఫేస్ బుక్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ అనేది ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే కాదని అన్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడాలని చెప్పారు. ఫేస్ బుక్ ఉన్నత వర్గాలవారికి మాత్రమే కాదని... అందరి కోసం అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: