నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి మరణం తర్వాత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను టీడీపీ నేత చంద్రబాబు మంత్రిని చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదట వైకాపా నుండి పోటీ చేసి గెలిచిన తండ్రీ కూతురు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. ఆ సమయంలో టీడీపీ నుండి బరిలోకి దిగి భూమా చేధిలో ఘోరంగా ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి ఈ సారి ఖాళీ అయిన స్థానంలో మళ్లీ టీడీపీ నుండి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాక టికెట్ రాణి పస్ఖంలో వైకాపా లోకి జం అవుతానని హెచ్చరించారు కూడా.


Image result for akhila priya

కానీ మరో వైపు భూమా అఖిల ప్రియ మాత్రం భూమా కుటుంబం నుండే నంద్యాల అభ్యర్థి ఖరారవుతారని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. అయితే ఒక వైపు భూమా సెంటి మెంట్, మరో వైపు శిల్పా మోహన్ రెడ్డి హెచ్చరిక నేపథ్యంలో బాబు ఇరు వర్గాలను సంతృప్తి చెందించాలానే ప్రయత్నం లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగూ అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చామని, ఇక నంద్యాల సీటు మాత్రం శిల్పా మోహన్ రెడ్డికి ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.


Image result for akhila priya chandrababu

చివరగా అఖిల ప్రియ నంద్యాల టీడీపీ అభ్యర్థి విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని సెలవిచ్చారామె. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటామని అఖిలప్రియ సెలవిచ్చారు. రెండు మూడు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నిక విషయమై చంద్రబాబుతో భేటీ అవుతామని చెప్పారామె. మొత్తమ్మీద, ఈ రోజు నంద్యాల ఉప ఎన్నికపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది. భూమా కుటుంబానికి షాకిచ్చి, శిల్పా కుటుంబాన్ని బుజ్జగించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: