గత కొన్ని రోజులుగా భారత్ పై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పపడుతుంది.  ఓ వైపు ప్రపంచ దేశాల ముందు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు సైనిక దాడులు చేస్తూ మన సైనికులకు సవాల్ విసురుతుంది.  ఆ మద్య భారత సైనికులపై దొంగ దాడి చేసి ఇద్దరి తలలు నరికి చిత్రవధ చేసిన దానికి బదులు గా భారత్ ఆర్మీ పాక్ స్థావరాలపై విరుచుకు పడింది.  తాజాగా సాయుధ చొరబాటుదారులకు పాకిస్తాన్ ఆర్మీ సహకరిస్తోందని భారత ఆర్మీ ఆరోపించింది. నియంత్రణ రేఖ వద్ద పాక్ రేంజర్ల దాడులను అడ్డుకునేందుకు భారత్‌ కూడా దాడులు చేస్తున్నట్టు మేజర్‌ జనరల్‌ అశోక్  తెలిపారు.

జమ్మూక‌శ్మీర్‌లోని నౌషెరాలో ఉన్న పాక్ ఆర్మీ పోస్టుల‌ను భార‌త ఆర్మీ ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన వీడియోల‌ను భార‌త ఆర్మీ రిలీజ్ చేసింది. సాయుధ చొర‌బాటుదారుల‌కు సాయం చేస్తున్న పాక్ ద‌ళాల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు కూడా ఆర్మీ ప్ర‌క‌టించింది. పాక్ ఆర్మీ పోస్టుల‌ను ధ్వంసం చేయ‌డం వ‌ల్ల ఆ దేశానికి భారీ న‌ష్టం జ‌రిగిన‌ట్లు మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ నారులా తెలిపారు.  

జమ్మూ  కాశ్మీర్ లో శాంతి భద్రతలే తమ లక్ష్యమని ఆర్మీ మేజర్‌ జనరల్‌ అశోక్‌ నరులా ప్రకటించారు.  గత కొన్ని రోజులుగా నౌషారా సెక్టార్ లో పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూ.. మరోవైపు ఉగ్రవాదుల చొరబాటుకు సాయం చేస్తున్నారని, అందుకే ఈ దాడులు చేశామన్నారు.పాక్ ఆర్మీ పోస్టుల‌ను ధ్వంసం చేసిన భార‌త ఆర్మీకి కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేసింది.

attack-at-loc


మరింత సమాచారం తెలుసుకోండి: