చెప్పడానికి చేసి చూపడానికీ చాలా తేడా ఉంటుంది. మోడీ మాటల్లోనే కాదు చేతల్లో కూడా మళ్ళీ ఒకసారి తన సత్తా ఏంటో చాటుకున్నారు. ప్రముఖ వ్యక్తుల యొక్క యెర్ర బుగ్గలని తీసేయమని చెప్పిన మోడీ తన ఎర్ర బుగ్గలు కూడా తీసేశారు. తాజాగా రోడ్డు మీద వెళుతున్న ఆయన.. తన వరకూ తాను సైతం వీఐపీ అన్న భావన ఉండదన్నట్లుగా వ్యవహరించారు.


తన కాన్వాయ్ ను ఆపేసి మరీ.. ఒక అంబులెన్స్ కు దారి ఇచ్చిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన షెడ్యూల్ ఆలస్యాన్ని పక్కన పెట్టేసి.. అంబులెన్స్ కు దారి ఇవ్వటమే ముఖ్యంగా వ్యవహరించారు. ఇందుకోసం సెక్యూరిటీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టేశారు.


ఈ  ఆసక్తికర ఉదంతం ఎలా చోటు చేసుకుందన్న విషయంలోకి వెళితే.. ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ వార్షిక సమావేశంలో పాల్గొని గాంధీనగర్ - అహ్మదాబాద్ మార్గంలో వెళుతున్నారు.వారి వెనుక ఒక అంబులెన్స్ వస్తున్న విషయాన్ని గుర్తించారు.వెంటనే.. తన కాన్వాయ్ ను సైడ్ లేన్ లోకి తీసి ఆపాలని సూచించారు. ప్రధాని ఆదేశాలతో తూచా తప్పకుండా జరగటం.. వెనుక ఉన్న అంబులెన్స్ వెళ్లిపోవటం జరిగిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: