విశాఖలో తెలుగుదేశం పండుగు మహానాడు అంగరంగ వైభవంగా సాగుతోంది. రెండోరోజు ఎన్టీఆర్ జయంతి  సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడికి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలంటూ తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇదే సమయంలో మహానాడు వేదికగా వైసీపీపై ఎటాక్ కూడా ప్రారంభించారు తెలుగుదేశం నేతలు.

Image result for chandrababu and balakrishna
దీనికి ప్రతిగా వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ వైఖరిపై సెటైర్ల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ పై మ‌హానాడులో తీర్మానాలు పెట్టి వాటిపై చర్చిస్తోన్న నేతలు.. ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో ఎలా మానసిక క్షోభకు గురయ్యారో కూడా చర్చించివుంటే బాగుండేదని కామెంట్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్నను సాధించ‌డంలోనూ టీడీపీ చిత్తుశుద్ధితో ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. 


Image result for roja  on  balakrishna
అంతే కాదు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఎంతమాత్రమూ పనికిరారని మండిపడ్డారు. తెలుగుదేశం నేతలు ఆ పదవికి నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఎన్నుకోవాలని రోజా సూచించారు. అలా చేస్తే టీడీపీకి మేలు చేకూరుతుందని.. ఎన్టీఆర్ వారసత్వం కొసాగుతుందన్నారు రోజా. 



మరింత సమాచారం తెలుసుకోండి: