టీడీపీ సొంత కార్యక్రమం మహానాడు విజయవంతమైంది. మూడు రోజుల పాటు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సమర్థమైన నాయకత్వ పనితీరుకు నిదర్శనంగా మహానాడు మూడు రోజుల కార్యక్రమం నిలిచిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తామని 
వెల్లడించారు.

mahanadu కోసం చిత్ర ఫలితం

విశాఖ వేదికగా సమర్థ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యానికి మహానాడు వేదికగా నిలిచిందని చంద్రబాబు అన్నారు. అన్ని రకాలుగా మహానాడు చాలా తృప్తి నిచ్చిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా స్ఫూర్తిదాయక బృందాన్ని రూపొందించుకున్నామని చంద్రబాబు తెలిపారు. యువ నాయకత్వం బాగా పనిచేసిందని కితాబిచ్చారు. 

mahanadu కోసం చిత్ర ఫలితం

మహానాడు నిర్వహణలో ప్రతి అంశంపైనా 80శాతానికి పైగా సంతృప్తి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. అంతే కాదు. మూడు రోజుల మహానాడును దాదాపు కోటి మంది 
మీడియా ద్వారా వీక్షించారని చంద్రబాబు లెక్కలు చెప్పారు. సామాజిక మాధ్యమం ద్వారా మహానాడును ఆఫ్‌లైన్‌లో చూశారని సీఎం తెలిపారు. మహానాడును 13 లక్షల మంది ప్రత్యక్షంగా, 82 లక్షల మంది ఆఫ్‌లైన్లో చూశారని వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: