తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎన్నో సంచలనాలు సృష్టించిన బ్యుటీషియన్ శిరీష కి సంబంధించిన ఓ ఆడియో రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  గత నాలుగు సంవత్సరాలు గా రాజీవ్ నిర్వహిస్తున్న ఫోటో స్టూడియోలో శిరీష బ్యుటిషియన్ కమ్ హెచ్ గా విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే వారి మద్య చనువు పెరిగి వివాహేతర సంబంధం ఏర్పడింది.  ఈ మద్య రాజీవ్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న తేజస్విని అనే అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు.  వారి మద్య ప్రేమ ఏర్పడటం..త్వరలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవడం జరిగింది.  
Image result for sirisha suicide
ఈ విషయం శిరీషకు తెలియడంతో రాజీవ్ ని నిలదీసింది..అంతే కాదు తేజస్వినితో అడపాదడపా గొడవలు పెట్టుకోవడం పోలీస్ స్టేషన్ వరకు గొడవ వెళ్లడం జరిగింది.  ఈ గొడవ నేపథ్యంలోనే రాజీవ్, శిరీష, శ్రవణ్ లు కుకునూరుపల్లికి వెళ్లడం అక్కడ మద్యం సేవించడం..తర్వాత ఒంటరిగా ఉన్న శిరీషపై ఎస్సై ప్రభాకర్ అసభ్యంగా ప్రవర్తించడంతో శిరీష గట్టిగా కేకలు వేయడం జరిగింది.  దీంతో ఎస్సై ప్రభాకర్ కోపంతో వారందరికీ అక్కడ నుంచి వెళ్లిపోమ్మని చెప్పడంతో..కారులో తిరిగి బయలు దేరారు.  
Related image
సిటీకి వచ్చిన శిరిష అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కథ విషాదంగా ముగిసింది.  అయితే ఇప్పుడు బ్యుటీషియన్ శిరీష ఆడియో టేపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాజీవ్‌తో తేజస్విని చనువుగా ఉండటాన్ని శిరీష తట్టుకోలేక పోయిన విషయం తెలిసిందే.  రాజీవ్ తో తేజస్విని ఏం మాట్లాడింది..దానికి రాజీవ్ ఏం సమాధానం ఇచ్చాడు..అని టేపుల్ని ఇవ్వాలంటూ రాజీవ్ స్నేహితుడు నవీన్‌ను శిరీష రిక్వెస్ట్ చేసింది.
Image result for sirisha suicide
ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్ తాజాగా వెలుగు చూశాయి.రెండు నెలల క్రితం తేజస్విని-రాజీవ్‌ల వ్యవహారం శిరీషకు తెలియడంతో శిరీష -తేజస్విని మధ్య గొడవ జరిగింది. తేజస్విని తన శత్రువని.. ఆమె రాజీవ్‌తో మాట్లాడిన ఆడియో టేపును తనకు ఇవ్వాలని రాజీవ్ స్నేహితుడు నవీన్‌ను శిరీష కోరింది. దీన్ని బట్టి శిరీష రాజీవ్ పై ఎంత నమ్మకం పెంచుకుందో..తాను మోసం చేసిన విషయం తెలుసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఈ ఆడియో టేపు ల ద్వారా తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: