ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పై ఆయన పై సోషల్ మీడియాలో అసభ్యకర అభ్యంతరకర పోస్టింగులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఫోటొలను మార్ఫింగ్ చేసి మరీ అవమానిస్తున్నారు. దీనికి ఇందులోని అసంభద్దత కు కారణ నేపధ్యం అధికారపార్టీ వ్యక్తులే అని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇంటూరి రవికిరణ్ పై తీసుకున్న చర్యలే ఐవైఆర్ పై అభ్యంతకర పోస్టింగ్స్ పెట్టినవారిపై తీసుకోవాలి. కాని అలా జరగక పోవటంతో ఈ సమస్యను ఆ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర గవర్నర్ వద్దకు నివేదించటం జరిగింది.
సామాజిక మాధ్యమాల్లో తనను అవమానించేలా, అవహేళన చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నరు నరసింహన్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు.
ఆయన బుధవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నరును కలిశారు. ఈ సందర్భంగా కొందరు పనిగట్టుకుని తన ప్రతిష్టను దెబ్బతీసే లా దురుద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమా ల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
"ఇలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారు, వాటిని చూపెట్టిన వారు మురుగు కాలువ (డ్రెయినేజి) స్థాయి మనుషులు. మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్నవారు. మురుగు కాలువ స్థాయి వ్యక్తులు చేస్తున్న వాటి గురించి ఆలోచించడం ద్వారా మీ స్థాయిని తగ్గించుకోవద్దు. మీరు వాటి గురించి ఆలోచిస్తే డ్రైనేజి పీపుల్ స్థాయి పెంచినట్లు అవుతుంది. అసలు వాటి గురించి పట్టించుకోవద్దు" అని ఈ సందర్భంగా గవర్నరు ఆయనకు ఉద్బోధించారు.
రంగారెడ్డి జిల్లా బొల్లారంలోని "రాజాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్" అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నరుకు ఈ సందర్భంగా భారతీయ విద్యా భవన్ కమిటీ (హైదరాబాద్) ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. బొల్లారం లోని "రాజాజీ ఇన్స్టిట్యూట్" లో కొత్తగా పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు దీనిని బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి గతంలో కూడా ఆయన గవర్నరును కలిసి చర్చించారు.
బుధవారం మళ్లీ ఇదే అంశాన్ని గుర్తు చేశారు. "త్వరలోనే అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేద్దాం. ఎలా చేస్తే బాగుంటుదో చర్చించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేద్దాం. ఈ ఇన్స్టిట్యూట్ లో పాఠశాల కచ్చితంగా ఏర్పాటు చేద్దాం" అని గవర్నరు హామీ ఇచ్చినట్లు సమాచారం.
దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం కాదని కొన్ని వర్గాల కోసం మాత్రమేనని అనుకొంటున్నారు. అందుకే ఇక్కడ ప్రజాస్వామ్య పాలన లేదని "ఓలిగార్కి" మోడల్ పాలన నడుస్తుందని అంటున్నారు. ఒక ముఠా పాలన లేదా ఒక చిన్న సంఖ్యలో ఉన్న కొందరు సంపన్నులు అధికారం కోసం పాలనను తమ నియంత్రణలోకి తీసు కున్నట్లని - ప్రతిపక్షాలతో సహా ప్రజా భాహుళ్యం భావిస్తుంది. లేకపోతే నాలుగు దశాబ్దాల ఉద్యోగ జీవితమంతా సేవజేసిన ఒక విశ్రాంత అధికారిపై ప్రభుత్వములోని ప్రముఖులే పూనుకోవటం దురదృష్టమంటున్నారు.