తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్న బ్యూటిషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఎ2 ముద్దాయి రాజీవ్ కి చెందిన రాసలీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎంబీఏ పూర్తి చేసిన రాజీవ్ ప్రొఫెషనల్ పోటో గ్రాఫర్ అంటూ అమ్మాయిలను అందమైన ఫోటోలు తీస్తానంటూ వారిని ఈజీగా ట్రాప్ చేస్తుండేవాడు. అంతే కాదు గతంలో ఇతగాడు నలుగురు అమ్మాయిలతో రాసలీలలు జరిపినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆర్జే స్టూడియో నడుపుతూ పెళ్లైన శిరీష అందాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆమెను బుట్టలో వేసుకున్నాడు.
తన స్టూడియోలో మేకప్ ఆర్టిస్టు గా ఉండమని..అలాగా హెచ్ ఆర్ విధులు నిర్వహించమని చెప్పాడు. తర్వాత ఆమెతో చనువు పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే పోలీసు విచారణలో బయటికి వస్తోన్న వాస్తవాలు పోలీసుల్నే నిర్ఘాతంతపరుస్తున్నాయి. అతని ఖాతాలో చాలామంది శిరీషలు ఉన్నారని, రాజీవ్ నలుగురు యువతులతో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అమ్మాయిలను ట్రాప్ లో పడేసి వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీస్తూ తర్వాత వాటిని అశ్లీల వీడియోలుగా మలిచి ఆ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేవాడు.
తర్వాత వారిని ఎలాగైనా వదిలించుకోవడానికి వీటిని ఉపయోగించేవాడు. రాజీవ్ తాజా ప్రేమికురాలు తేజస్విని, ఒకవైపు శిరీష మీద పోలీసుస్టేషన్లో కేసు పెడతానని బెదిరిస్తూనే, విజయవాడ వెళ్లి రాజీవ్ పేరెంట్స్ తో పెళ్లి విషయం మాట్లాడినట్లు పోలీస్ ఎంక్వైరీలో తేలింది. దీంతో తేజస్విని ఎలాగైనా వదిలించుకోవాలని రాజీవ్ ప్లాన్స్ వేసినట్టు బయటపడింది. రాజీవ్ ఫోన్లు, అతని దగ్గరున్న కొన్ని హార్డ్ డిస్క్ లలోనూ రాజీవ్ బాగోతాలు బయటపడ్డాయని సమాచారం.