బాబు ల్లో పెరిగిపోతున్న అసహనం తో తరిగిపోతున్న ప్రజాదరణ
ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేసే హక్కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కి లేదు!
భూ కుంభకోణంపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్కి ఎక్కడిది?
అవినీతి గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం కాక మరేమిటి?
పార్టీ ఫిరాయింపుల గురించి వైఎస్ జగన్ మాట్లాడితే అంతా నవ్విపోరా?
ఇలా చెప్పుకుంటూ పోతే, అధికార పార్టీ నేతలు వైఎస్ జగన్ విషయంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు చాలా చాలానే వేస్తూ వస్తున్నారు. అసహనంతో రగిలి పోతున్నారు.
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నంత మాత్రాన, వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత అన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు మరచిపోతున్నారు. అలా మర్చిపోతే ఎలా?
వైఎస్ జగన్ మీద అక్రమాస్తుల ఆరోపణలు ఆ తర్వాత, ఆయన జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాతే 2014లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ప్రజానీకం, "తెలుగుదేశం పార్టీకి అధికారం" కట్టబెడితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి "ప్రతిపక్ష హోదా" ఇచ్చారు. ఇది ప్రజల తీర్పు. ప్రజల ఆదేశం.
రెండు ప్రణాళికా కాలాలు అంటే ఒక దశాబ్ధం ప్రతిపక్షములో కూర్చొన్న తెలుగుదేశం కథానాయకునికి ప్రతిపక్షం అన్న పదానికే అర్ధం తెలియనట్లుంది. అసలు ప్రతిపక్షమంటే ఏంటి? అన్న విషయం చంద్రబాబుకే బాగా తెలుసుండాలి . ఎందుకంటే, ఆయన పదేళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేశారు మరి. కానీ, ప్రతిపక్ష నేత ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అన్న విషయాల మీద చంద్రబాబుకే సరైన అవగాహన లేనట్టుంది.
ప్రతిపక్షం అంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజా పక్షం అని చంద్రబాబుకి ఎప్పటికి తెలుస్తుంది? ఏమో, మళ్ళీ చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలోకి వస్తే తప్ప ఆయనకి తెలిసిరాదేమో!
ఆయనకు మళ్ళా ప్రతిపక్షనేత హోదా కావాలేమో? ఆయన కోరికకు
తగ్గట్టు ప్రజలు ఆయనకు ఆ హోదా కట్టబెట్టటానికి సిద్ధమౌతున్న దాఖలాలు
కనిపిస్తున్నాయి. అందుకే ఆయన అంత నిస్తేజానికి, నిస్సత్తువకు, నిరుత్సాహానికి
సరిగా చెప్పా లంటే ధారుణ డిప్రెషన్ కు తరచుగా గురౌతున్నారు. ఆయన్ని యనమల లాంటి
సీనియర్ నాయకులు కవర్ చేసుకు రావాల్సి వస్తుంది. జగన్ అవినీతి పరుడైనంత ప్రతిపక్ష నాయకుడు కాకపోడుకదా? ప్రజల్లో ప్రతిపక్ష సభ్యులని గోడ దూకించిన
కథానాయకునిపై ప్రజల్లో అసహనం పెరిగి క్రమంగా ప్రతిపక్ష నాయకునిపై ఆదరణగా
మారుతుంది. రానున్న ఎన్నికల్లో ఒక వేళ ప్రతిపక్షం అధికార పక్షంగా మారితే జరగనున్న
ధారుణ పరాభవాన్ని ఈ బాబులు భరించగలరా?
2019 ఎన్నికల్లో పరిస్థితులు తారుమారై, జగన్ ఆశిస్తున్నట్లుగా ఆయన ముఖ్యమంత్రి అయితే, ప్రతిపక్షనేతగా చంద్రబాబు మారితే, అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఎలా వుంటుంది? అప్పుడూ పార్టీ ఫిరాయింపులుంటాయి. అప్పుడూ అధికారపక్షం, ప్రతిపక్షాన్ని అణచి వేయడం అంటూ జరుగుతుంది. చట్టసభల్లో ఇప్పుడెలాగైతే ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశాన్ని అధికార పక్షం ఇవ్వడంలేదో అప్పుడు దృశ్యం తిరిగబడితే-ఒకవేళ కుడి ఏడమైతే - అదే జరగబోతోంది, అంటున్నాయి ప్రశాంత్ కిషొర్ సర్వే సారాంశాలు.
ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అధినేత అయినా, భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అధికారం వున్నప్పుడు విర్రవీగితే, అదికారం పోయాక తమ భవిష్యత్తు ఏంటన్నది? ఆలోచించుకోవాలి.
విశాఖలో లక్ష ఎకరాల భూ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షం ఆరోపిస్తున్నప్పుడు, ఆ ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి, అసలు ప్రశ్నించే నైతిక హక్కేలేదని అనడమేంటి?
పైగా, జగన్ విశాఖలో మహాధర్నా చేస్తే, దానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ధర్నా చేస్తారట.. ఇదెక్కడి సంప్రదాయమో ఏమో!
జగన్ని ఎలాగైనా విమర్శించొచ్చుగాక, ప్రతిపక్షానికి, ప్రతిపక్ష నేతకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అధికార పార్టీ పదేపదే మాట్లాడటమంటే, అసలిది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు మార్కు రాచరికమా? రాచరికమే ప్రజాస్వామ్యమని చంద్రబాబు భ్రమిస్తున్నారా?
ముందు ముందు ఇంకొకరి రాచరికంలో, చంద్రబాబు బృందం పరిస్థితి ఏమిటి? అసలు తానొక్కడే మిగిలి బృందం మాయ మవటం జరుగుతుందనుకోండి. “తాతకు పెట్టిన బొచ్చే జగన్ మోహన్ రెడ్డి బాబు తల వద్దనే పెట్టటం గ్యారెంటీ కదా! కౌరవ సభలో ద్రౌపతితో కలసి పాండవుల చేసిన శపధాలు కురుక్షేత్రం సాక్షిగా బదులిచ్చి కౌరవాంతం చూసిన దృశ్యం టిడిపికి పున రావృత మైతే చెవిరెడ్డి శపధాలకు అధికారుల నవరంధ్రాల్లో మైనం పెట్టేస్తే ప్రజలు అయ్యో పాపం! అని మాత్రం అనరు కదా!
అధికార యంత్రాంగం తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వినియోగించటం ఎన్నడో మానేసింది. బాధ్యతలు నేరవేర్చే అధికార యంత్రాంగమే నేడు భారత్ లో మృగ్యం. అధికారులు ప్రజా సేవకులు అన్న విషయం మానేసి రాజకీయనాయకుల బానిసలు అనిపించుకోవటం లోనే సంతోషం పొందుతున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో అధికారుల సిగ్గుపోయినా మరోసారి పోగొట్టుకోవటానికి రడీ ఔతుంది అ యంత్రాంగం.
అంటే వాళ్ళు రోజా కు శాసనసభ సాక్షిగా పరాభవం చేయలేదా ఈనాడు. జ్యోతి పెట్టి వెతకండి అంటే! అప్పుడు ఈనాడు ఆంద్ర జ్యోతి పత్రికల రాతలే సాక్ష్యాలు కావా! పరిస్థితి ఎలా వుంటుందో ఏమో? ఊహించుకోవడమే కష్టం కదా?
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం నేతలు అనుచిత భాషతో దుర్భాషలాడటం కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డిలు బహిరంగంగా జగన్ ను అనుచిత పదజాలంతో దూషించగా,ఇప్పుడు ఈ జాబితాలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా చేరారు. సాక్షాత్ అసెంబ్లీలో చింతమనేని తన సాటి ఎమ్మెల్యేలకు వినపడేలా ప్రతిపక్ష నేతను ఉద్దేశించి బూతుమాటను ఉపయోగించారు. దానిపై తీవ్ర దుమారం రేగింది.
ఇక జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం గురించి జగన్ పత్రిక ‘సాక్షి’లో కథనాలు రాశారని, తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అనంతపురం సాక్షి ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకుని జగన్ పై విరుచుకు పడ్డారు. జగన్ విషయంలో తీవ్రమైన అనుచిత పదజాలాన్ని ఉపయోగించి ప్రభాకర్ రెడ్డి రచ్చ చేశారు.
ప్రభాకర్ రెడ్డి మాట తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్పట్లో భగ్గుమన్నాయి. ఆ వ్యవహారం పై జగన్ స్పందనను మీడియా కోరగా, కుక్కలు మొరిగితే స్పందించాలా? అని అతి తేలికగా ప్రశ్నించారు.
తాజాగా విశాఖ భూముల కుంభకోణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను లక్ష్యంగా చేసుకోవడం పట్ల బండారు తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారు బండారు. ‘రెండు సార్లు ఎంపీపీని, నాలుగు సార్లు ఎమ్మెల్యేను, ఒకసారి మంత్రిగా కూడా చేశా! నాపై విమర్శలు చేస్తారా, వెధవలు’ అంటూ మొదలుపెట్టి తీవ్రమైన అనుచిత భాషతో, రాయలేని మాటలతో విరుచుకుపడ్డారు బండారు.
ఇవన్నీ రానున్న 2019 ఎన్నికల కురుక్షేత్రం తరవాత జరగనున్న పరిణామాలని జనభాషణ. కౌరవులకు సాటివచ్చే బోండా, దేవినేని, కేసినేని, బుద్ధా, చింతమనేని, జేసి ప్రభాకరరెడ్ది, అచ్చెన్నాయుడు, అనిత వీళ్ళకు కనిపిస్తున్న దృశ్యం నేడు వారికి నయనానందకరమైతే రేపు "చిత్రం చినిగి సితారవ్వటం ఖాయ" మంటున్నారు జనం.
"బాబుగారి నంద్యాల గీతోపదేశం" వెనక బెదిరింపులు జనములోకి శరవేగంగా దూసుకు పోవటమే కాదు, జనమస్తిష్కములో నిక్షిప్తమైందని తెలుస్తుంది. బాబు గీతోపదేశం దానిపై యనమల పూసిన నవనీతపూత మంటలు రేపుతుంది జనహృదయాల్లో ఘోషగా.
ప్రజలకిచ్చిన వాగ్ధానాలు మరచిన అధికారపార్టీకి, దాని మిత్రపక్షం బిజెపికి, వంత పాడిన పవన్ కళ్యాన్ కి తప్పనిసరిగా గుణ పాఠం చెప్పుతారు ప్రజలు. గెలుపును ఇచ్చి - పనిచేయండని చెపితే టిడిపి చేసిన పాడుపనులకు ప్రతిపక్షాన్ని నిందిస్తూ కాలం గడిపేస్తే ప్రజలు ఊర్కుంటారా?
దీన్ని బట్టి వైఎసార్ సిపిని దాని నాయకత్వాన్నెవరూ బుద్దిమంతులనరు. కాని వారికి ప్రజల సానుభూతి ఉంది. ఇప్పుడు ప్రజల దృష్ఠిలో పవన్ కళ్యాన్ ఒక వాడేసిన టుష్యూ పేపర్. ఏపి దృష్ఠిలో బిజెపి బుద్దిహీన, టిడిపి మోసకారి, జనసేన వాడేసిన టిష్యూ పేపర్ అట.
గౌతమీపుత్ర శాతకర్ణి - బాబు మెడకుచుట్టుకున్న "బందు బలగాల భవబందం" ప్రజల్లో మార్మోగుతున్న బాబు పక్షపాతం. రాష్ట్ర దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం