మాజీ ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విరుచుకు పడ్డారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం జరిగే పనే కాదు అన్నారు ఆయన. జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలి అని జనం చూస్తున్నారు అనీ ఆ రోజు త్వరలో రాబోతోంది అని జోస్యం చెప్పారు భాస్కర రావు.


" కుల రాజకీయాలు చెయ్యడం లో చంద్రబాబు నిష్ణాతులు యిపోయారు. ఆయన పాలన లో అంతా అవినీతి జరుగుతోంది. గతం లో కాంగ్రెస్ కి వెళ్ళే టైం లో చంద్రబాబు కి టికెట్ ఇవ్వాలి అనుకున్నాం కానీ చంద్రబాబు అప్పట్లో నడిపిన కుల రాజకీయాలు, యూనివర్సిటీ టైం లో కులం కోసం వేసిన వేషాలూ అన్నీ గుర్తుకు వచ్చి ఆయనకి అప్పట్లో సీటు ఇవ్వలేదు..


అప్పుడు కుర్రాడిగా కుల పిచ్చి ఉండేది ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా అదే ఉంది " అంటూ ఏకేసారు నాదెండ్ల. చంద్రబాబు జీవితం మొత్తం అబద్ధాల మీద నే బతుకుతున్నారు అన్న ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకి సున్నా మార్కులు వేస్తా అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: