తెలుగుదేశంలో ఫ్యామిలీ లీడ‌ర్ల హవా న‌డుస్తోంది. ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ మంత్రిగా కొన‌సాగుతుండ‌గా, వియ్యంకుడు బాల‌య్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం నంద‌మూరి ఫ్యామిలీని కూడా రంగంలోకి దించాల‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌ట‌. ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ప్ర‌చార రంగంలోకి దింపాల‌నుకుంటున్న‌ర‌ట‌. 
 
అయితే 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తానే చంద్ర‌బాబుయే సీఎం అభ్య‌ర్థి అని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే టీడీపీలో ఇంకెవ‌రైనా సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగితే ఎలా ఉంటుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ఓ అన్‌లైన్ స‌ర్వే మాత్రం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రిజ‌ల్ట్ ఇచ్చింది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిస్తే ఎవ‌రు సీఎం అయితే బాగుంటుంద‌ని అనే ప్ర‌శ్న‌కు నెటిజ‌న్లు అత్య‌ధికంగా చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణికే ఓటేశారు.


టీడీపీ గెలిస్తే బ్ర‌హ్మ‌ణీ సీఎం అయితే బాగుంటుంద‌ని 35 శాతం మంది ఓటేశారు. బ్ర‌హ్మ‌ణీ త‌ర్వాత స్థానం జూనియ‌ర్ ఎన్టీఆర్‌కే ద‌క్కింది. టీడీపీకి ఎన్టీఆర్ సీఎం అయితే బాగుంటుంద‌ని 29 శాతం మంది ఓటేశారు. జూనియ‌ర్ త‌ర్వ‌త చంద్ర‌బాబు మూడో ప్లేస్ ద‌క్కించుకున్నారు. మ‌ళ్లీ సీఎం చంద్ర‌బాబు అయితేనే బెట‌ర్ అని 20 శాతం మంది అనుకుంటున్నారు. త‌ర్వాత బాల‌య్య‌కు 3 శాతం, లోకేష్ 2 శాతం, హ‌రికృష్ణ‌కు ఒక‌శాతం ఓట్లు ప‌డ్డాయి. ఇప్పుడే చెప్ప‌లేం, ఇంకెవ‌రైనా అయితే బాగుంటుంద‌ని 11 శాతం ఓట్లు ప‌డ్డాయి. 
 
మొత్తానికి నంద‌మూరి ఆడ‌ప‌డుచు బ్ర‌హ్మ‌ణీ, నంద‌మూరి న‌ట‌వార‌సుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కు మంచి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పిందీ స‌ర్వే.  


మరింత సమాచారం తెలుసుకోండి: