ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు..ముఖ్యంగా కొన్ని క్రీడల్లో జరిగే ప్రమాదాలు కళ్లముందే జరిగిపోతుంటాయి.  ఇక క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడూ విషాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా బౌలర్‌ వేసే బంతిని సరిగ్గా అంచానా వేయక పోవడం వల్ల మైదానంలో యువ క్రికెటర్ మృత్యువాత పడ్డాడు. 

పాకిస్థాన్‌కు చెందిన జుబేర్ అహ్మ‌ద్ అనే బ్యాట్స్‌మ‌న్ మ‌ర్దాన్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా.. బౌల‌ర్ విసిరిన బౌన్స‌ర్ అత‌ని త‌ల‌ను బ‌లంగా తాకింది.  దీంతో జుబేర్  అక్కడిక్కడే మృతి చెందాడు.  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మార్డన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో జుబైర్‌ క్వెట్టా బియర్స్‌ జట్టు తరపున ఆడుతున్నాడు. 

క్వెట్టా బియర్స్‌ జట్టు త‌ర‌ఫున నాలుగు లిస్ట్ ఎ, టీ20 మ్యాచ్‌లు ఆడాడు.  విషాద వార్త‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.  క్రికెట్ మైదానంలో బ్యాట్స్ మెన్స్ విధిగా హెల్మెట్ దరిస్తుంటారు. గ‌తంలో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సంద‌ర్భంగా ఆస్ట్రేలియా క్రికెట‌ర్ ఫిలిప్ హ్యూస్ బంతి బ‌లంగా త‌గ‌ల‌డంతో మృతి చెందిన విష‌యం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: