బాలయ్య నంద్యాల ప్రచారం టీడీపీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉండగా మరొక పక్క వైకాపా నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురుకొంటూ ఉన్నారు బాలయ్య.


టీడీపీ వ్యవస్థాపకుడు అయిన దివంగత ఎన్టీఆర్ కొడుకు అయ్యుండీ తన ఆలోచనలని ఉపయోగించకుండా చంద్రబాబు చెప్పిన మాట వినే కీలుబొమ్మ అంటూ బాలయ్య మీద వైకాపా ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు.


బాబు రాసిచ్చిందే బాలకృష్ణ తన ప్రసంగంలో చెప్పాడని పేర్కొంటూ పాపం అని ఎమ్మెల్యే బాలకృష్ణపై కౌంటర్ వేశారు. " పిల్లనిచ్చిన మామకి , అతని సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచిన బాలయ్య కి అసలు సిగ్గుంటే మళ్ళీ చంద్రబాబు కి ఊడిగం చెయ్యదు.


ఇప్పటి వరకూ దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యే లని వైకాపా తరఫున ఉన్నవారిని కోటి రూపాయలు ఇచ్చి టీడీపీ ఎత్తుకుని వెళ్ళింది. కానీ ఇప్పటి వరకూ ఒక్కరూ రాజీనామా చెయ్యలేదు. ఇవన్నీ బాలయ్య తెలిసి కూడా ప్రచారం చేస్తున్నారు. బాబు వెన్నుపోటుకు జగన్ విశ్వసనీయతకు మధ్య ఎన్నిక జరుగుతోంది అది అందరూ అర్ధం చేసుకోవాలి " అన్నారు రోజా. 

మరింత సమాచారం తెలుసుకోండి: