నంద్యాల ఉప ఎన్నిక కి సంబంధించిన వైనం ముగిసింది. ప్రచారం చెయ్యడానికి ఇక ఎంతమాత్రం వీలు లేదు నిన్నటి తోనే ప్రచారం డోర్ లు క్లోజే అయిపోయాయి .. ఇప్పుడు సైలెంట్ గా రేపు జరగబోతున్న ఎన్నిక కోసం వేచి చూడడం తప్ప అధికార విపక్షాలు చెయ్యగలిగింది ఏదీ లేదు.


అయితే ఈ ప్రచారం పూర్తి అయిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి వెంటనే కాకినాడ చేరుకున్నారు. ఈ నెల 29 న కాకినాడ మునిసిపల్ కార్పరేషన్ ఎన్నికలు జరగబోతున్న నేపధ్యం లో రేపటి నుంచీ 27 వరకూ జగన్ కాకినాడ లో మకాం వెయ్యబోతున్నారు అని సమాచారం.


టీడీపీ - బీజేపీ కూటమి కి వ్యతిరేకంగా వైకాపా ఇక్కడ గట్టి పోటీ ఇవ్వడం కోసం సిద్దం అవుతోంది. గెలుపునే లక్ష్యంగా చేసుకుని ఇక్కడ జగన్ ప్రచారం చేస్తరాట.


మొత్తం 48 డివిజన్లలో ఎన్నికలు సాగనుండగా, ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వారంలో జగన్ తో పాటు చంద్రబాబు కూడా కాకినాడలో ఉద్ధృతంగా ప్రచారంలో పాల్గొననున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: