వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకూ లండన్ వెళ్తున్నారు. సాధారణంగా ఏడాదికోసారి విహారం కోసం జగన్ విదేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ లండన్ యాత్ర విహారానికి కాదు.. కుమార్తెను యూనివర్సిటీలో చేర్పించేందుకు జగన్ వెళ్తున్నారు. చదువులో కుమార్తె ప్రతిభను చూసి జగన్ ఉప్పొంగిపోతున్నారు.

Image result for jagan daughter

          జగన్ కు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో వర్ష రెడ్డి పెద్ద కుమార్తె. ఆమె ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో సీటు సంపాదించింది. ప్లస్ టూలో 99శాతం పైగా మార్కులు వస్తేనే అక్కడ సీటు దక్కుతుంది. అంతేకాకుండా ఎంట్రన్స్ పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసిన వర్ష రెడ్డి.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో సీటు దక్కించుకుంది. ఇక్కడ సీటు రావడాన్ని అదృష్టంగా భావిస్తుంటారు.

Image result for jagan daughter varsha

          జగన్ తన పిల్లలిద్దరినీ రాజకీయాలకు దూరంగా పెంచుతున్నారు. ఎక్కడా వారు వేదికలపై కానీ, సమావేశాల్లో కానీ కనిపించరు. బాహ్యప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే వారు మీడియా కంటపడ్డారు. అసలు వాళ్లు ఎలా ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. అయితే ఇద్దరు పిల్లలూ చదువులో మాత్రం దిట్ట అని తెలుస్తోంది. ఇప్పుడు వర్ష రెడ్డి అడ్మిషన్ కోసం జగన్ లండన్ వెళ్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: