కేసిఆర్ ప్రభుత్వం , కేసిఆర్ రెండూ కూడా ఎస్ సి , బీసీ ల కోసం చాలా పథకాలు ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్నారు. కానీ అధికార యంత్రాంగం పోలీసుల యొక్క కుల దురహంకారం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు . వారి శాడిజం మొత్తం అణగారిన వర్గాల మీద చూపిస్తూ దమన కాండ కి పాల్పడుతున్నారు పోలీసులు.


నేరెళ్ళ లో ఇసుక లారీ దగ్ధం చేసారు అంటూ దళితుల తో సహా పలువురు అణగారిన వర్గాల మీద పోలీసులు ఛార్జ్ చేసారు. వారిని చిత్ర హింసలకి గురి చేసారట పోలీసులు. గూడెం గ్రామంలో భూ పంపిణీలో పక్షపాతానికి నిరసనగా దళితులు ఎంఎల్‌ఎ కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి ప్రయత్నించారు.


అలాగే యాదగిరి భువనగిరి జిల్లాలో వర్ణ వివక్షత పెరిగిపోయి ఒక వేరే జాతి వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అనే కోపం తో దళిత వ్యక్తిని చంపేస్తే పోలీసులు మినిమం కూడా పట్టించుకోలేదు. ఈ విషయం బయట పడిన తరవాత కూడా పాలక పక్షం నుంచి అసలు స్పందన అనేది కనపడలేదు. తాజాగా ఇపుడు మరొక సంఘటన కేసిఆర్ మార్కు ప్రభుత్వానికి కళంకం గా మారింది.


అడవి బిడ్డలు గా పిలవబడే గుత్తి కోయిల మీద అటవీ శాఖ సిబ్బంది అమానుష దౌర్జన్యం చేసారు అంటోంది మెయిన్ స్త్రీం మీడియా. తాడ్వాయి అటవీ ప్రాంతంలో గుత్తికోయ మహిళలను చెట్లకు కట్టి చీరలు లాగి నిర్బంధానికి గురి చేసిన దారుణం అన్ని ప్రముఖ పత్రికలు ఫోటోలతో సహా ఇచ్చాయి. ఇదంతా కక్ష తోనే చేసారు అని కూడా అందరికీ తెలుసు. టీ సర్కారు లో ఈ వ్యవహారం లో ఖచ్చితంగా స్పందన రావాల్సిందే లేదంటే మాయని మచ్చగా మిగిలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: