తెలంగాణా కాంగ్రెస్ లో సభ్యుల కంటే గ్రూపులే ఎక్కువ ఉంటాయి అనే జోక్ ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. దాని గురించి స్పెషల్ గా మేన్షన్ చెయ్యనక్కరలేదు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ని బాధ్యతల నుంచి తప్పించాలి అనే ప్రయత్నం కోసం కొందరు కాంగ్రెస్ నేతలు డిల్లీ వరకూ వెళ్లి తమ తమ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే .

పార్టీ పగ్గాలు తమ చేతికి ఇస్తే చాలు తమ స్టాండర్డ్ ఏంటో చూపిస్తాం, కాంగ్రెస్ ని తెలంగాణా లో సూపర్ స్టేజీ లో నిలబెడతాం అంటూ వారు బహిరంగంగా చెప్పడమే కాక సోనియా గాంధీ దగ్గర కూడా చెప్పేసి వచ్చారు. ఇదే క్రమం లో తమ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ మీద సీరియస్ విమర్శలు చెయ్యడం, ఆయన తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేవు అంటూ మూతి విరవడం లాంటివి జరుగుతున్నాయి.

త్వరలో నల్గొండ ఉప ఎన్నిక వచ్చేలా ఉండడం తో ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడమే కోరుకుంటున్నారు కోమటి రెడ్డి సోదరులు. ఈ రకమైన విమర్శలు రివర్స్ లో ఉత్తమ కుమార్ వర్గం నుంచి కోమటి వర్గం వైపు వినపడుతున్నాయి. సొంత పీసీసీ వర్గాన్ని ఎప్పటికప్పుడు తప్పు పట్టడం అనేది సొంత పార్టీ ని దిగాజార్చుకునే పనే అని సీరియస్ అవుతున్నారు వాళ్ళు.

ఉత్తమ కుమార్ ని మాత్రమే టార్గెట్ చేసిన కోమటి రెడ్డి సోదరులు ఈ దృష్టి తెరాస ని విమర్శించడం లో పెట్టాలి అంటున్నారు కొందరు. పైగా, త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న న‌ల్గొండ పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గం ఉప ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రు సోద‌రుల ప‌నితీరుపై త‌మకు న‌మ్మ‌కం లేద‌నే వాద‌న ఉత్త‌మ్ వ‌ర్గం నుంచి వినిపిస్తోంది. ఆ సోదరులు ఇద్దరూ కేసిఆర్ కి అనుకూలంగా ఉన్నారు అని ఉత్తం రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: