భారత దేశంలో అమాయక భక్తుల మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకొని ఎంతో మంది దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు.  కొంత మంది తమ పొట్టకూటికోసం చేస్తుంటే..మరికొంత మంది బాబాలు కోట్లకు పడగెత్తుతున్నారు.  భారత దేశంలో సంచలనం రేకెత్తించిన గుర్మిత్ రామ్ రహీం బాబా  ఇద్దరు సాద్విలపై అత్యాచారం చేసిన ఘటనలో 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.    సాధారణంగా సన్యాసి అన్నవారు అన్నీ త్యజించి ప్రజలకు సేవ చేస్తూ..మంచిని బోధిస్తూ ప్రజలను సక్రమ మార్గంలో నడిపించేలా చేయాలి.  
Image result for journalist ramanand tatiya
కానీ ఇప్పటి బాబాలు శృంగార పురుషులు..విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. డేరా బాబా విషయంలో ఇది అక్షర సత్యం..ఆయన విలాసాల గురించి తెలుసుకొని పోలీసులే షాక్ అవుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి  డేరా బాబా ఆశ్రమాల్లో ఎన్నో భయంకర నిజాలు బయట పడుతున్నాయి. బాబా తనకు ఎదురు తిరిగిన వారిని చంపి తన ఆశ్రమ ప్రాంగణంలోనే పాతి పెట్టేవాడని గతంలో ఆయన అనుచరుడిగా ఉన్న వ్యక్తి చేప్పారు.  
Image result for dera sacha sauda skeletons
డేరా బాబా ఆశ్రమంలో ఇప్పుడు  సంచుల కొద్దీ అస్తిపంజరాలు వెలికి తీస్తున్నాయి దర్యాప్తు బృందాలు. దాదాపు 600కు పైగా అస్తిపంజరాలను బయటకు తీశారు.  మరో దారుణమైన విషయం ఏంటంటే..ప్రతి అస్తి పంజరంపైనా అందమైన పూల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది.  మరోవైపు ఆయన అణుచరులు మాత్రం ఇవి తమ ఆశ్రమానికి వచ్చిన భక్తులవని..మోక్షం కోసం చనిపోయిన వారి మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టేవారని చెబుతున్నారు.  
డేరా బాబా జల్సా చూస్తే..దిమ్మతిరుగుడు ఖాయం..!
గుర్మిత్ చాలా దారుణంగా హత్యలు చేసేవారని, రహస్యంగా వారిని ఆశ్రమంలోనే పాతిపెట్టించేవాడని ప్రముఖ  జర్నలిస్టు రామానంద్‌ తాతియా తెలిపారు. డేరా క్యాంపస్‌లో మరిన్ని తవ్వకాలు జరపాలని పట్టుబడుతున్నారు. కనిపించకుండా పోయిన దాదాపు 500మంది జాడలు ఆ తవ్వకాల్లో బయటపడతాయని అంటున్నారు తాతియా.  అంతే కాదు ఆ తవ్వకాలు కూడా జాతీయ మీడియా సమక్షంలో ఆశ్రమంలో తవ్వకాలు జరపాలని కోరారు


మరింత సమాచారం తెలుసుకోండి: