ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక నిప్పులు చెరిగారు. కృష్ణా జలాలపై ప్రచురించిన వార్తపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ది పనులు చేపట్టే ప్రతిసారి ఏదో ఒక వివాదం సృష్టిస్తూ..ఆ పనులకు అడ్డుపడుతున్నారని ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత అభివృద్దికి తోడ్పాటు ఇవ్వాలని అన్నారు. 
Image result for tdp
కానీ  జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిలో మాత్రం తప్పుడు రాతలు దుర్మార్గంగా, నీచాతి నీచంగా ఉన్నాయని పేర్కొన్నారు.రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్న జగన్, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాళ్లను రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి వార్తలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు.
Image result for ys jagan
తన క్యాంపు కార్యాలయంలో శనివారం ‘జలసిరి’ పాట ‘జల జల జల జలసిరికి హారతి.. జన జన జన జనసిరికి హారతి’ అంటూ సాగే పాటను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఆ పత్రికలో వస్తున్న వార్తలు  జగన్ తీరు మరోమారు ప్రస్ఫుటమైందన్నారు. ఆ రాతలపై రాష్ట్రమంతా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: