భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని గురేజ్ వ్యాలీ (జమ్ముకశ్మీర్) లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మద్య నేతలు ఎలాంటి సంబరాలైనా వినూత్నంగా జరుపుకోవడం జరుగుతుంది. భారతో లో జమ్మూ-కాశ్మీర్ లో ఎప్పుడూ ఏదో ఒక సంచలన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..తండ్రి వారసత్వంగా వచ్చినా..తనదైన మార్క్ వేసుకుంటుంది. వివాదాస్పద జమ్మూ కశ్మీర్ లో సీఎం గా తన బాధ్యతలు చక్కగా సాగిస్తుంది తాజాగా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.ఇండో-పాకిస్తాన్ సరిహద్దులోని ఆర్ఎస్ పురా సెక్టార్లో ఉన్న ఆనాథాశ్రయంలోని పిల్లలతో మెహబూబా ముప్తీ పండగ పూట సరదాగా గడిపారు.
చిన్నారుకు మిఠాయి పంచడమేకాక వారికి తానే స్వయంగా తినిపించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆమెకు పాటలు పాడి వినిపించారు. మెహబూబా ముఫ్తీ గత ఏడాది కూడా పిల్లలతోనే దీపావళి జరుపుకున్నారు.