ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరి రాజకీయాల్లో ఎక్కువగా ఆనం సోదరుల పేర్లు వినిపిస్తుంటాయి.  ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు కాంగ్రెస్ లో తమ సత్తా చాటారు ఆనం సోదరులు.  తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో టీడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు టీడీపీ లో చేరిపోయారు.

ఇక ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆనం వివేకానంద రెడ్డి ఎన్నో సంచలనాలు సృష్టించారు.  ప్రస్తుతం ఆనం ఇంట విషాదం చోటు చేసుకుంది.  ఆనం సోదరుల తల్లి ఆనం వెంకటరమణమ్మ కన్నుమూశారు. 

ఆమెకు నలుగు కుమారులు..ఆనం వివేకానందరెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి వీరిద్దరినీ ఆనం బ్రదర్స్ అని అంటారు. మరో ఇద్దరు కుమారులు ఆనం జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. 98ఏళ్ల వెంకటరమణ్మకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: