ఈ మద్య తెలంగాణలో కొన్ని చోట్లు భూకంపం వస్తూ ప్రజలను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఆ మద్య స్వల్ప భూకంపం రావడంతో చాలా మంది ఇళ్లు వదిలి బయటకు వచ్చారు. తాజాగా హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, దుర్గం చెరువు, పెద్దమ్మగుడి ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు చెబుతున్నారు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 0.5గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇదేమంత తీవ్రమైనది కాదని, దీనివల్ల భయపడాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. కేబీఆర్ పార్కు ప్రదేశంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండటంతో ఈ విషయం కూడా ఎవరూ గమనించలేకపోయారని తెలుస్తోంది. భూమి కంపించగానే భయాందోళనలతో ఇళ్లలోంచి బయటకు వచ్చినట్టు తెలిపారు.. దీనిపై మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.